బయ్యారం, జూన్ 8: కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ సూచించారు. మండలంలోని ఇర్సులాపురం, రామచంద్రాపురం, జగత్రావుపేట, కంబాలపల్లి, కొయ్యగూడెం, కొత్తగూడెం పంచాయతీల్లో భరోసా యాత్ర మంగళవారం ఐదో రోజు కొనసాగింది. గ్రామాల్లో హోం ఐసొలేషన్లో ఉం టున్న 80 మందిని ఇంటింటికీ వెళ్లి పరామర్శించి, ఆరో గ్య స్థితిని తెలుసుకున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. అనంతరం వారికి కూరగాయలు, కోడి గుడ్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, ఎంపీపీ చేపూరి మౌనిక, వైస్ ఎంపీపీ తా త గణేశ్, మండల ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, సర్పంచ్లు వెంకన్న, వెంకటేశ్వర్లు, భా స్కర్, సుభద్ర, లక్ష్మణ్రావు, వెంకట్రమణ, ఎంపీటీసీ అన్నపూర్ణ, రైతుబంధు సమితి మండల కోఆర్డ్డినేటర్ నా గేశ్వరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, నాయకులు ఐ లయ్య, ఉప్పలయ్య, రాకేశ్, కృష్ణ, మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.
ఐసొలేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
చిన్నగూడూరు: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్లను కరోనా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని డీఎల్పీవో శర్ఫుద్దీన్ సూచించారు. మంగళవారం మండలకేంద్రంలో కరోనా బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య స్థితులపై ఆరా తీశారు. ఇంటి వద్ద సౌకర్యవంతంగా లేని పాజిటివ్ నిర్ధారైన వారు ఐసొలేషన్ సెంటర్లకు రావాలని వారికి అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలన్నారు. కరోనా కట్టడికి ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. నా యబ్ తహసీల్దార్ కోమల, ఏఎన్ఎం నర్సుబాయి, సర్పంచ్ మల్లయ్య, ఆశ కార్యకర్తలు అనిత ఉన్నారు.