శేరిలింగంపల్లి, జూన్ 6: గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్హాల్లో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్థానిక గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇనార్బిట్మాల్ సౌజన్యంతో కొవిడ్ వారియర్స్కు ఇమ్యూనిటీ బూస్టర్లను ఆయన పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ రవి తదితర ప్రముఖులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.