రామ్గఢ్: జార్ఖండ్లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు చెందిన సెక్యూరిటీ గార్డులను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న రాత్రి రామ్గఢ్ జిల్లోని గెయిల్కు చెందిన పైప్లైన్ ప్రాజెక్టు వద్ద రక్షణగా ఉన్న సెక్యూరిటి సిబ్బంది కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్కు పాల్పడినవారిలో ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, దేశీయ తుపాకులను స్వాధీనం చేసున్నామని ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఒక సెక్యూరిటీ గార్డును వెంటనే విడుదల చేయగా, మరొకరిని 19 రోజుల తర్వాత వదిలిపెట్టారని చెప్పారు. అనుమానితులంతా ఒకే గ్రామానికి చెందినవారని వెల్లడించారు.