హైదరాబాద్ : కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని పేర్కొంది.
వలస కార్మికులు భారీగా రైళ్లలో స్వస్థలాలకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తపై రైల్వే సీపీఆర్ఓ స్పందించారు.
రాత్రి కర్ఫ్యూ ప్రభావంతో ఎవరూ వలసలు వెళ్లట్లేదని ఆయన తెలిపారు. వేసవిలో ప్రయాణికుల సంఖ్య పెరగకపోగా బాగా తగ్గిందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సగానికి సగం తగ్గాయని వెల్లడించారు. కరోనా సమయంలో అపోహలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి