కెరీర్ తొలినాళ్ల నుంచి ఏడాదికి ఓ సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వేగాన్ని పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘బాంగ్ బాంగ్’, ‘వార్’ సినిమాలతో హిందీ చిత్రసీమలో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ చక్కటి పేరును సొంతం చేసుకున్నారు. ఇటీవలే ప్రభాస్ను కలిసిన సిద్ధార్థ్ ఆనంద్ ఆయనకు ఓ కథను వినిపించినట్లు తెలిసింది.యాక్షన్ అంశాలకు ఎంటర్టైన్మెంట్ను మేళవించి దర్శకుడు సిద్ధం చేసిన పాయింట్ నచ్చడంతో ప్రభాస్ ఈ సినిమాను అంగీకరించినట్లు చెబుతున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘ఆది పురుష్’తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.