హర్యానాలోని రోహ్తక్ రైల్వేస్టేషన్ లో ఓ ట్రైన్ కి నిప్పంటుకుంది. స్టేషన్ లో పార్క్ చేసిన ట్రైన్ లో మంటలు చెలరేగాయి. నాలుగు బోగీల్లో ఈ మంటలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు.