ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ పోస్టు ఖాళీ అయ్యి వారం రోజులవుతున్నా నూతన స్పీకర్ను నియమించకోపోవడంపై ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్పీకర్ పోస్టును ఇన్ని రోజులు ఖాళీగా ఉంచడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. గవర్నర్ రికమెండ్ చేసినా స్పీకర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని రాజ్యాంగ అమలులో మహారాష్ట్ర సర్కారు వైఫల్యంగా చెప్పవచ్చని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.