కరోనా నిర్మూలనకు సహాయచర్యలు, వైద్య సదుపాయాల కోసం తాను ఇప్పటివరకు దాదాపు 15కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చానని తెలిపారు బిగ్బి అమితాబ్బచ్చన్. ఇటీవలకాలంలో కోవిడ్ విరాళాలకు సినీ తారలు దూరంగా ఉంటున్నారనే విమర్శలొస్తున్నాయి. వీటిపై అమితాబ్బచ్చన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘చేసిన సహాయాన్ని పదేపదే చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. దేనినైనా ఆచరణలో పెట్టి చూపించాలనుకుంటా. ఢిల్లీలోని గరుద్వారాకు కోవిడ్ సహాయనిధి క్రింద రెండుకోట్లు విరాళమిచ్చాను. అలాగే ముంబయిలోని జుహూలో యాభైపడకల కోవిడ్ సెంటర్ నెలకొల్పడానికి నిధుల్ని సమకూర్చాను. ఇరవై వెంటిలేటర్ల కోసం విదేశాలకు ఆర్డర్ పెట్టాను. వైద్య సిబ్బందికి వేల సంఖ్యలో పీపీఈ కిట్లు అందజేశాను. ఇప్పటివరకు కరోనా కోసం నేను చేసిన సహాయం మొత్తం 15కోట్లు అయింది. కాబట్టి సహాయం చేయడం లేదని నిందించడం తగదు’ అని అమితాబ్బచ్చన్ తెలిపారు.