రామాయంపేట,ఏప్రిల్2: తెలంగాణ ప్రభుత్వం ఆలయాలకు పెద్ద పీట వేస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాదగిరి,మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, లక్ష్మణ్యాదవ్ పాల్గొన్నారు.
చేగుంటలో..
చేగుంట, ఏప్రిల్ 3: నార్సింగిలోని శేరిపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మఆలయ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కల్యాణోత్సవం నిర్వహించగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పా ల్గొని ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ సబిత, సర్పంచ్ మల్లేశం,ఎంపీటీసీ సంతోశ్, నార్సిం గి మండల టీఆర్ఎస్ నాయుకులు , ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులున్నారు.
చిన్నశంకరంపేటలో గణపతిహోమం
చిన్నశంకరంపేటలోని వరసిద్ధివినాయక ఆలయ పం చమ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వా మికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ కూడా చదవండి
సొంత మెసేజింగ్ ప్లాట్ఫామ్పై మైక్రోసాఫ్ట్ మోజు.. అందుకోసమే..!
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?