సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు మూడేళ్లకు పైగానే సమయం కేటాయించాడు. సినిమా షూటింగ్కు అనేక అవాంతరాలు ఏర్పడడంతో చిత్ర రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. మే 13న చిత్రం విడుదల కానుందని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన కరోనా వలన మూవీ మరోసారి వాయిదా పడింది.
ఆచార్య షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉందని మూవీ వచ్చే ఏడాది విడుదల కానుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ దీనిపై తాజా ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఇంకా కేవలం పది నుంచి పన్నెండు రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. గత ఏడాది లేట్గా మొదలైన చిత్ర షూటింగ్ నవంబర్ నుండి శరవేగంగా జరుపుకుంది అని అన్నారు. లాక్డౌన్ పూర్తయ్యాక వీలైనంత త్వరగా చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.