టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్)’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో బన్ని కారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్తో పాటు హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్న అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా ఎంతగానో అలరించాడు. రావు రమేష్ విలనిజంతో పాటు దేవి శ్రీ ప్రసాద్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. 2017 జూన్ 23న విడుదల ఈ చిత్రం టీవీల్లో, డిజిటల్ ఫ్లాట్ఫామ్లో, యూట్యూబుల్లోను అదరగొడుతుంది. తాజాగా ‘డీజే’ తెలుగు వర్షెన్కు యూట్యూబ్లో వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి. రేర్ రికార్డ్ సాధించడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యూట్యూబ్లో హిందీ డబ్బింగ్ వర్షన్లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది.