‘నవరస’ పేరుతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళంలో ఓ వెబ్సిరీస్కు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. తొమ్మిది భాగాల్లో నవరసాల్ని స్పృశిస్తూ ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నారు. గౌతమ్మీనన్, బెజోయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, రతీంద్రన్ప్రసాద్, హరితాసాలిమ్, అరవిందస్వామి ఒక్కో భాగానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ఈ సిరీస్ ద్వారా వచ్చే డబ్బులను కరోనాతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న తమిళ సినీ కార్మికులకు అందించనున్నారు. ఈ సిరీస్కు సంబంధించిన తొలి పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ఇందులో హీరో సూర్య, కథానాయిక ప్రయాగరోజ్ మార్టిన్లు ఉన్నారు. సూర్య నటించిన ఈ ఎపిసోడ్కు గౌతమ్మీనన్ దర్శకత్వం వహించారు.