మహర్షి సినిమాతో చివరి సారిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు డైరెక్టర్ వంశీపైడిపల్లి. ఈ దర్శకుడు నెక్ట్స్ చేయబోయే సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. పవన్కల్యాణ్ కోసం వంశీపైడిపల్లి ఓ కథ రాశాడట. అంతేకాదు త్వరలోనే స్టోరీలైన్తో పవన్ కల్యాణ్తో చర్చలు జరుపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాను సిద్దం చేసిన స్క్రిప్ట్ పవన్కు పర్ఫెక్ట్గా సరిపోతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాడట వంశీపైడిపల్లి.
మరికొన్ని రోజుల్లోనే వంశీపైడిపల్లి-పవన్ కల్యాణ్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు ఇన్సైడ్ టాక్. మరోవైపు పవన్ కల్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్తోపాటు హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు హరీష్ శంకర్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి వంశీపైడిపల్లి-పవన్ కాంబో ఎలాంటి స్టోరీతో వస్తారని ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో