తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేశ్ లాంఛ్ చేశాడు. సినిమా విజయవంతం కావాలని నరేశ్ ఆకాంక్షించాడు.
ఎక్సోడస్ మీడియా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆకర్షణీయంగా ఉంది. కెమెరామన్ అయిన ఎన్వీఆర్ దర్శకుడిగా విజయవంతం కావాలి.
ఈ చిత్రం ద్వారా ఎక్సోడస్ మీడియాకి మంచి డబ్బులొచ్చి మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలు నిర్మించాలని కోరుకున్నాడు నరేశ్.
ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ..ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో..ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ..కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ మాస్ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తుందన్నారు.
కంటికి కనిపించని కరోనా వైరస్ తో ప్రపంచమంతా పోరాటం చేస్తోంది.
మరి వైరస్ లాంటి ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే తమ చిత్రమని నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు టేక్మాల్ శ్రీకర్ రెడ్డి, కుమారస్వామి సంగ, హ్యారీ సిల్వెస్టర్, కొయ్యడ నితిన్, మాస్టర్ కింగ్ జో, వాసు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ