ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఫుల్ పాపులర్ అయిన నటుడు కార్తికేయ. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో కార్తీకేయకి అటు తమిళం, ఇటు తెలుగులో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కబాలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలని నిర్మించిన కలైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు. బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతుంది. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ చిత్రంలో కార్తికేయ బాక్సర్గా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తికేయ సరసన ముంబై భామలు దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ లని కథానాయికలుగా నటిస్తున్నారు . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ని మార్చి 20న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలిపింది. ఈ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుంది.