హైదరాబాద్, జూన్5: టూవీలర్ లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ జిప్ ఎలక్ట్రిక్ హైదరాబాద్లో నిత్యావసరాల్ని డెలివరీ చేసేందుకు 100 ఈ- స్కూటర్లతో కార్యకలాపాల్ని ప్రారంభించింది. డెలివరీల కోసం ఇప్పటికే బిగ్బాస్కట్, స్పార్ హైపర్మార్కెట్స్, గ్రోఫర్స్ వంటి గ్రాసరీ, ఈ-రిటైల్, ఫుడ్టెక్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిప్ ఎలక్ట్రిక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ కార్యకలాపాలతో తొలిసారిగా దక్షిణాది మార్కెట్లోకి అడుగుపెడుతున్నామని, వచ్చే 4-5 నెలల్లో ఈ-స్కూటర్ల సంఖ్యను 500కు పెంచుతామని సీఈఓ అకాశ్ గుప్తా తెలిపారు.