న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు శుక్రవారం భారమయ్యాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 300 పెరిగి రూ 47,519 పలికింది. ఇక కిలో వెండి దాదాపు రూ 500 పెరిగి రూ 63,220కి ఎగబాకింది.
ఇక బంగారం, వెండి ధరల తదుపరి దిశను జాక్సన్ హోల్ సింపోజియంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ ప్రసంగం నిర్ధారిస్తుందని బులియన్ నిపుణులు చెబుతున్నాయి. కరోనా నుంచి ఆర్ధిక వ్యవస్ధ రికవరీ ప్రక్రియ మందగించడం, వైరస్ కేసుల పెరుగుదలతో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
ఆప్ఘనిస్ధాన్లో ఉద్రిక్తతలు కూడా బంగారానికి సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెంచుతాయని బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.