ముంబై,జూలై : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాలతో మొదలైన దేశీయ సూచీలు చివరిదాకా అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397పాయింట్ల లాభంతో 52,769 వద్ద,నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణికి తోడు అమెరికామార్కెట్ల సానుకూల పరిస్థితులు, వ్యాక్సినేషన్లో పురోగతి తదితర అంశాలు ఈరోజు మార్కెట్ల పై సానుకూల ప్రభావం చూపాయి.