న్యూఢిల్లీ : భారత్లో ఎట్టకేలకు తన రేజర్ హైబ్రిడ్ స్కూటర్ను యమహ లాంఛ్ చేసింది. ఫాస్కినో హైబ్రిడ్ తర్వాత ఇది యమహ ఇండియా లైనప్లో రెండో హైబ్రిడ్ స్కూటర్. ఇక రేజర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ 76,830 (ఎక్స్ షోరూం, ఢిల్లీ)కాగా, రేజర్ హైబ్రిడ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ 79,830కి అందుబాటులో ఉంది. వీటితో పాటు స్పోర్టియర్ రేజర్ స్ట్రీట్ ర్యాలీ హైబ్రిడ్ (రూ 83,830)ను కూడా యమహ లాంఛ్ చేసింది.
2021 రేజర్ హైబ్రిడ్ పవర్ట్రైన్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో అందుబాటులో ఉంది. న్యూ రేజర్ 123 ఎఫ్ఐ, స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ వెర్షన్ లాంఛ్తో భారత్లో హైబ్రిడ్ స్కూటర్ పోర్ట్ పోలియో విస్తరణకు వెసులుబాటు కలిగిందని యమహ మోటార్ ఇండియా చీఫ్ మోటోఫుమి షిటర పేర్కొనన్నారు. ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్కు అనూహ్య స్పందన రావడంతో మార్కెట్లో తమ స్ధానం మరింత బలోపేతం చేసుకోగలమనే విశ్వాసం ఏర్పడిందని చెప్పారు.
న్యూ టెక్నాలజీతో స్కూటర్ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం కొనసాగిస్తామని వెల్లడించారు. నూతన స్కూటర్స్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, డిజిట్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజన్ కటాఫ్ స్విచ్, ఆటోమేటిక్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.