న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా తన రెండు మోడళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్జెడ్ 25 బైకుల తయారీ ధర తగ్గడంతో వీటి ఎక్స్-షోరూమ్ ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఎఫ్జెడ్ఎస్ 25 ధరను రూ.19,300 మేర తగ్గించగా, ఎఫ్జెడ్ 25 ధరను రూ.18,800 తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత ఎఫ్జెడ్ఎస్ 25 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.1,39,300గా ఉండగా.. ఎఫ్జెడ్ 25 ధర రూ.1,34,800గా ఉంది.
ఆ మధ్య ముఖ్యమంగా ఎఫ్జెడ్ 25 సిరీస్ మోడల్ తయారీ ఖర్చు భారీగా పెరిగిపోవడం వల్ల ధరలు పెంచామని, మొత్తానికి ఇప్పుడు ఆ ఖర్చును తగ్గించగలిగామని ఆ ప్రకటనలో యమహా ఇండియా తెలిపింది. ధర తగ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అవే ఉంటాయని స్పష్టం చేసింది.