న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ యమహా ఇండియా దేశీయ విపణిలోకి నియో రెట్రో మోడల్లో కొత్తగా డిజైన్ చేసిన మోటారు సైకిల్ ఎఫ్జెడ్-ఎక్స్ను ఆవిష్కరించింది. స్మార్ట్ ఫోన్లతో అనుసంధానించేలా ఈ బైక్లో వై కనెక్ట్ యాప్ జత చేశారు. ఎఫ్జడ్-ఎక్స్ మోడల్ బైక్.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నది.
స్టాండర్డ్ వేరియంట్ బైక్ ధర రూ.1,16,800గా నిర్ణయించారు. స్మార్ట్ఫోన్తో అనుసంధానించే ఫీచర్ గల వేరియంట్ ధర రూ.1,19,800 అని యమహా ఇండియా పేర్కొంది.
దీనిలో ఇన్కమింగ్ కాల్స్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్, బ్యాటరీ ఛార్జింగ్ ఇండికేటర్, ఇంధన వినియోగం, మాల్ఫంక్షన్ వంటి అంశాలపై అలర్ట్ వస్తుంది.
ఈ నెలలోనే బైక్ డెలివరీలను ప్రారంభించనున్నారు. స్టాండర్డ్ ఇంజిన్ బాష్ ప్లేట్ గల ఈ బైక్కు ఎల్ఈడీ హెడ్లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు జత కలిశాయి. ఇంకా 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను బిగించారు. ఇది 12.4 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ బైక్ బరువు 139 కిలోలు.
వినియోగదారుల అభిరుచులకు తగినట్లు డిజైన్లో మార్పులు చేసినట్లు యమహా ఇండియా పేర్కొంది. ఆన్లైన్లో ఈ బైక్ బుకింగ్, కొనుగోలు సౌకర్యం కల్పించింది. బైక్ను ఇంటివద్ద డెలివరీ చేస్తారని కంపెనీ పేర్కొంది.