న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ (xiaomi ) భారత మార్కెట్లలో మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసింది. ఎంఐ 11 సిరీస్లో MI 11 అల్ట్రా, MI 11 ఎక్స్, MI 11 ఎక్స్ ప్రో మోడల్స్ని తీసుకొచ్చింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ మూడు స్మార్ట్ ఫోన్లను షియోమీ పరిచయం చేసింది.
అయితే, ఈ మూడు స్మార్ట్ఫోన్ల ప్రత్యేకతలు గతంలో తెలిసినవే. చైనాలో ఎంఐ 11 అల్ట్రా గతంలోనే విడుదలైంది. అక్కడి స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో అది అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఎంఐ 11 ఎక్స్, ఎంఐ 11 ఎక్స్ ప్రో మోడల్స్ అందరూ ఉహించినట్టుగానే రెడ్మీ కే 40, రెడ్మీ కే 40 ప్రో+ రీ బ్రాండెడ్ వర్షన్లు. ఈ రెండు ఫోన్లు కూడా చైనాలో ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యాయి. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ మూడు స్మార్ట్ఫోన్లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేశారు.
ఎంఐ 11 అల్ట్రా
ఎంఐ 11 అల్ట్రా ప్రారంభ ధర రూ.69,990. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర. కేవలం ఒకే వేరియంట్లో ఈ స్మార్ట్ఫోన్ రిలీజ్ అయ్యింది. అయితే, సేల్ ఎప్పుడు ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు. అమెజాన్తోపాటు షియోమీఇండియా అధికారిక వెబ్సైట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ప్రత్యేకతలు
డిస్ప్లే: 6.81 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888
రియర్ కెమెరా: 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్
ఎంఐ 11 ఎక్స్
ఇక ఎంఐ 11 ఎక్స్ ప్రారంభ ధర రూ.29,999. ఇది 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 8 జీబీ + 128 జీబీ మోడల్ కూడా రిలీజ్ అయింది. దీని ధర రూ.31,999. మొదటి సేల్ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొంటే రూ.3,500 క్యాష్బ్యాక్ లభిస్తుంది.
ప్రత్యేకతలు
డిస్ప్లే: 6.67 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870
రియర్ కెమెరా: 48మెగాపిక్సెల్ Sony IMX582 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,520 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, ఫ్రాస్టీ వైట్
ఎంఐ 11ఎక్స్ ప్రో
ఇక ఎంఐ 11 ఎక్స్ ప్రో 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.39,990 కాగా, 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.41,999. మొదటి సేల్ ఏప్రిల్ 24న ప్రారంభం కానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొంటే రూ.4,000 క్యాష్బ్యాక్ లభిస్తుంది.
ప్రత్యేకతలు
డిస్ప్లే: 6.67 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888
రియర్ కెమెరా: 108 మెగాపిక్సెల్ సాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,520 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, ఫ్రాస్టీ వైట్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు