న్యూఢిల్లీ : ముడి చమురు ధరల సెగతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆల్ టైం హైగా 10.49 శాతానికి ఎగబాకింది. ముడిచమురు, నూనెలు, కమాడిటీ ధరల పెరుగుదలతో ఏప్రిల్ లో టోకు ధరల ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగిసిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. మార్చిలో 7.39 శాతంగా నమోదైన డబ్ల్యూపీఐ ఏప్రిల్ లో ఆల్ టైం హైకి చేరింది.
ముడి చమురు, పెట్రో ఉత్పత్తులు, తయారీ వస్తువుల ధరల పెరుగుదలతో ఏప్రిల్ లో వార్షిక ద్రవ్యోల్బణ రేటు పెరిగిందని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ఇక ఆహారోత్పత్తుల ధరలు తగ్గడంతో ఏప్రిల్ లో వినిమయ ధరల సూచీ 4.29 శాతానికి తగ్గడం కొంత ఊరట ఇస్తోంది.