సిమ్లా : ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తున ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటైంది. హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ జిల్లా లాహౌల్లో ఖాజాలో దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో జనాభాను బట్టి మరికొన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఖాజా జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. వాటిలో ఒకదానిని శుక్రవారం ప్రారంభించామని పేర్కొంది. జనాభాను నియంత్రించడానికి ఈవీ స్టేషన్లు కూడా సాయ పడతాయన్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తున అంటే 500 అడుగుల ఎత్తున ఖాజాలో ఈవీ చార్జింగ్ స్టేషన్ ఇది. ఇది తొలి ఈవీ చార్జింగ్ స్టేషన్. దీనికి మంచి స్పందన వస్తే మరికొన్ని ఏర్పాటు చేస్తాం. వాయు కాలుష్యం నివారణకు దోహదపడుతుందని ఖాజా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) మహేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు.