ముంబై, ఏప్రిల్ 1: హైదరాబాద్ తమ రెండో హబ్ అని వరల్డ్ లాజిస్టిక్స్ పాస్పోర్ట్ (డబ్ల్యూఎల్పీ) సంస్థ తెలిపింది. దేశీయ వ్యాపార విస్తరణ వివరాలను గురువారం ప్రకటించిన డబ్ల్యూఎల్పీ.. ముంబై తర్వాత భారత్లో హైదరాబాదే తమకు ప్రధానమని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రెండు జీఎమ్మార్ గ్రూప్ అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో డబ్ల్యూఎల్పీ పనిచేయనున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన డబ్ల్యూఎల్పీ.. భారతీయ భాగస్వాములుగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవ సేవ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గోలతో జట్టు కట్టిన విషయం తెలిసిందే.