హైదరాబాద్, జూలై 20: వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వండర్లా హాలీడేస్ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ పార్క్ మూతపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజిటర్లను ఆకట్టుకోవడానికి సంస్థ ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రోజులపాటు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద జీఎస్టీ కలుపుకొని టిక్కెట్ ధరను రూ.799గా నిర్ణయించింది. ప్రతి గురువారం నుంచి ఆదివారం వరకు మాత్రమే ఈ పార్క్ తెరిచివుండనున్నది.