న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వినియోగంలోకి తెచ్చిన వ్యాక్సిన్లు ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. దేశాన్ని కరోనా టీకాల కొరత వేధిస్తున్న వేళ దేశీయ ఫార్మా దిగ్గజ్జం వాక్హార్డ్ తీపి కబురందించింది.
తమకు ఏటా 200 కోట్ల టీకా డోసులను తయారు చేయగల సామర్థ్యం తమకు ఉన్నదని వాక్హార్డ్ పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి యాభై కోట్ల వ్యాక్సిన్లతో ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నది. ఈ సంగతిని కేంద్రానికి వాక్హార్డ్ తెలిపిందని మీడియాలో వార్తలొచ్చాయి.
తాము ముందుగా ఏ కంపెనీల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలో గుర్తిస్తామని వాక్హార్డ్ వెల్లడించింది. ఆయా ఫార్మా సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి సహకారం కావాలని కేంద్రాన్ని కోరింది.
ఇప్పటికే తాము కొవిడ్-19 టీకాల ఉత్పత్తికి అవసరమైన టెక్నాలజీని వాక్హార్డ్ సమకూర్చుకుంటున్నట్లు వినికిడి. ఎంఆర్ఎన్ఏ, ప్రోటీన్ ఆధారిత, వైరల్ వెక్టర్ ఆధారిత ఇలా పలు టెక్నాలజీలతో రూపొందించిన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలమని ఆ సంస్థ తెలిపింది.
ఆయా వ్యాక్సిన్లపై అవసరమైన పరిశోధనలు చేపట్టడానికి కావాల్సిన సామర్థ్యం తమ సంస్థకు ఉందని కేంద్ర ప్రభుత్వానికి వాక్హార్డ్ ఇప్పటికే తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైతే భారత్ ఆవల బ్రిటన్ కోసం టీకాల తయారీకి ఆ ప్రభుత్వంతో వాక్హార్డ్ ఒప్పందం కుదుర్చుకున్నది.
ప్రస్తుతం దక్షిణ వేల్స్లోని సంస్థ తయారీ కేంద్రం నుంచి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను వయల్స్లో నింపి, ప్యాక్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో వాక్హార్డ్ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచనలో పడింది.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!