Quad on 5G Network | చైనా టెలికం కంపెనీల 5జీ టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందన్న అంచనాల మధ్య సురక్షితమైన పారదర్శక 5జీ టెలికం నెట్వర్క్ ఏర్పాటుతోపాటు సెమీ కండకర్ల సరఫరాలో భద్రత పెంచాలని క్వాడ్ సదస్సు నిర్ణయించింది. ఐరాస సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన క్వాడ్ కూటమి సమావేశమైంది. సభ్యదేశాలు తొలిసారి భౌతికంగా కూటమి సదస్సుకు హాజరు కావడం ఇదే మొదటి సారి.
ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా భారీగా సెమీ కండక్టర్ల మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ పెంచుకోవడంపై చైనా టెక్ సంస్థలు దృష్టి సారించాయి. అలాగే 5జీ నెట్వర్క్పైనా చైనా సంస్థలు పట్టు కలిగి ఉండటం పట్ల క్వాడ్ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఈ సదస్సులో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.