న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సుప్రీంకోర్టులో గొప్ప విజయం లభించింది. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలపై వ్యక్తిగత గ్యారంటర్ల ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. దీంతో కొన్ని డజ్లన మందికి పైగా పారిశ్రామికవేత్తలపై వ్యక్తిగతంగా దివాళా కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునేందుకు అనుమతి లభించినట్లయింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనిల్ అంబానీ సహా పలువురు కార్పొరేట్ల రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తుల భవితవ్యం తేలనున్నది. బ్యాంకులు ఇచ్చిన రుణాలపై కంపెనీల తరపున వ్యక్తిగతంగా గ్యారంటీలు సమర్పించిన కార్పొరేట్ అధినేతలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవచ్చు.
సంజయ్ సింఘాల్, అతుల్ పుంజ్, సబ్బినేని సురేంద్ర, వేణుగోపాల్ ధూత్, అనిల్ అంబానీ, యోగేశ్ మెహ్రా తదితరులపై బ్యాంకులు నమోదు చేసిన ఐబీసీ రూల్స్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికీ సంబంధిత వ్యక్తులపై ఉన్న దివాళా పిటిషన్లు పరిష్కారం కాకుంటే ముందుకు వెళ్లేందుకు వెసులుబాటు లభించింది.
వివిధ బ్యాంకులు చేపట్టిన దివాళా చర్యలకు వ్యతిరేకంగా కార్పొరేట్ల పిటిషన్లపై వివిధ హైకోర్టులు రిలీఫ్ ఇచ్చాయి. దీనికి వ్యతిరేకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ).. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రుణాల ఎగవేతకు పాల్పడినందుకు వ్యక్తిగత గ్యారంటర్ల పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐబీబీఐ వ్యతిరేకించాయి. వీరి ఆస్తుల విక్రయంతో రుణాల రికవరీ చేపట్టొచ్చని పేర్కొన్నాయి.
కార్పోరేట్ సంస్థలు తీసుకున్న రుణాలకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన వారు దేశంలోని వివిధ హైకోర్టుల్లో 19 కేసులు నమోదు చేశాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ మాజీ అధినేతలు సంజయ్ సింఘాల్, ఆర్తి సింఘాల్ రూ.12,275 కోట్ల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు.
పూంజ్ ల్లాయిడ్ వ్యవస్థాపకుడు అతుల్ పుంజ్ రూ.4,900 కోట్లు, కోస్టల్ ప్రాజెక్ట్ చైర్మన్ సబ్బినేని సురేంద్ర రూ.6000 కోట్ల వ్యక్తిగత పూచీకత్తులను బ్యాంకులకు సమర్పించారు.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్), రిలయన్స్ ఇన్ఫ్రా టెల్ (ఆర్ఐటీఎల్)లు ఎస్బీఐలో తీసుకున్న రూ.1200 కోట్లకు పైగా రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు అందజేశారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న వ్యాపార వేత్తలు యోగేశ్ మెహ్రా, అనిల్ మెహ్రా రూ.540 కోట్ల చొప్పున రుణాలకు గ్యారంటీ సమర్పించారు.
వీటితోపాటు మరో తొమ్మిది రుణాల ఎగవేత కేసుల్లో పూచీకత్తుదారులకు వ్యతిరేకంగా ఆయా బ్యాంకులు దివాళా ప్రక్రియ ప్రారంభించాయి. వీటికి వ్యతిరేకంగా పూచీకత్తు దారులంతా ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
గతేడాది ఆగస్టు 27వ తేదీన అనిల్ అంబానీ నుంచి రూ.1200 కోట్ల రుణానికి ఆయన ఆస్తులను విక్రయించడం నిలిపేయాలని ఎస్బీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ ఈ కేసు పెండింగ్లో ఉంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!