న్యూఢిల్లీ: ఫస్ట్ ఒర్జినేటర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ను గుర్తించడం మెసేజింగ్ యాప్ వాట్సాప్కు సమస్యాత్మకంగా మారనున్నది. సోషల్ మీడియా సంస్థల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం నూతన ఐటీ నిబంధనలను అమలులోకి తెచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఐటీ నిబంధనలు అమలు చేయాల్సిన సోషల్ మీడియా దిగ్గజాలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాట్సాప్.. యాప్లో పోస్ట్ చేసిన సమాచారానికి మూలం (ఫస్ట్ ఒర్జినేటర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్) గుర్తించాలి. అలా చేయాలంటే మొత్తం తమ ప్లాట్ఫామ్ పునర్వ్యవస్థీకరించాలని పేర్కొంది.
ప్రభుత్వ అధికారులు కోరినప్పుడల్లా వాట్సాప్లో వచ్చిన ఒక స్పెసిఫిక్ పోస్టుకు సంబంధించిన సమాచార మూలం ఎవరనేది వెల్లడించాల్సి ఉంది.
దీంతో కేంద్ర ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అనుబంధ వాట్సాప్.. ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. 45 కోట్ల మంది కస్టమర్లకు కల్పిస్తున్న ప్రైవసీని కేంద్రం తక్కువ చేస్తున్నదని వ్యాఖ్యానించింది.
ఢిల్లీ హైకోర్టులో 2017 నాటి జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసును వాట్సాప్ లేవనెత్తింది. పౌరుల వ్యక్తిగత సమాచారం ట్రేస్ చేయడం అంటే ఆయన ప్రైవసీ.. అంటే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం అని పేర్కొంది.
తాజా ఐటీ నిబంధనల అమలులో సంస్థ విఫలమైతే, తమ సంస్థ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టొచ్చన్న నిబంధననూ వాట్సాప్ సవాల్ చేసింది. వాట్సాప్తోపాటు ఇతర మెసేజింగ్ యాప్స్ సిగ్నల్, టెలిగ్రామ్ కూడా కేంద్రం ఐటీ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాల్సిందే.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్ల ఉత్పత్తికి వాక్హార్డ్ రెడీ.. కానీ?!