ప్రయోజనమని కొందరు.. అశాస్త్రీయమని మరికొందరు విద్యావేత్తల వాదన
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై విద్యావేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విధానం నిష్పక్షపాతంగా ఉన్నదని కొందరు ఆహ్వానిస్తుండగా, శాస్త్రబద్ధంగాలేదని మరికొందరు విమర్శిస్తున్నారు. పది, పదకొండు తరగతుల్లో మెరుగ్గా మార్కులు సాధించిన 12వ తరగతి విద్యార్థులకు ఈ మూల్యాంకనం ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందని రోహినీలోని ఎంఆర్జీ స్కూల్ డైరెక్టర్ రజత్ గోయల్ తెలిపారు.10వ తరగతి మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇవ్వడం మంచి నిర్ణయమని సేత్ ఆనంద్రామ్ జైపురియా ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ శిశిర్ జైపురియా అన్నారు. మరోవైపు, 12 ఫలితాలకు 10, 11 తరగతుల మార్కులను ప్రాతిపదికగా తీసుకోవడమేంటని హెరిటేజ్ స్కూల్స్ సీఈవో విష్ణు కార్తిక్ ప్రశ్నించారు. రెండు తరగతుల్లోని సబ్జెక్టులకు తేడాలు ఉన్నాయన్నారు. 10, 11వ తరగతిలో ప్రతిభ చూపని విద్యార్థి.. 12వ తరగతిలో పట్టుదలగా చదివినప్పటికీ, గడిచిన బోర్డు పరీక్షల మార్కులను తీసుకోవడం వల్ల ఆ విద్యార్థికి నష్టమేనని ఎఫ్ఐసీసీఐ ఎరైజ్ చైర్మన్ మనిత్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.హెరిటేజ్ స్కూల్స్ సీఈవో విష్ణు కార్తిక్