ఆకలితో అలమటించే వారికి అన్నం పెడుతూ.. ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తూ.. దిక్కులేని వారికి నిలువనీడ కల్పిస్తూ… ఆపత్కాలంలో అన్నార్తులకు మేమున్నామంటూ భరోసానిస్తున్నది గుడ్ సమరిటన్స్ ఇండియా’. అయినవాళ్లు ముందుకు రాని వేళ.. కొవిడ్ మృతులకు అంత్యక్రియలు సైతం నిర్వహిస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నది. సంస్థ ఫౌండర్ ఏఐ జార్జ్ రాకేశ్ బాబు, కో ఫౌండర్ సునీత జార్జ్, యేసుకల ఆధ్వర్యంలో సభ్యుల బృందం ఈ సేవలు కొనసాగిస్తున్నది. సమయం ఏదైనా.. కాల్ చేస్తే చాలు.. అభ్యాగులకు తోడుగా నిలుస్తున్నది.
కొవిడ్ రోగులకు అనేక రకాల సేవలు అవసరం పడుతున్నాయి. నిర్ణీత సమయంలో వారికి సేవలందకపోతే చాలా ప్రమాదం. అందుకే మా బాధ్యతగా వారికి సహాయం అందిస్తున్నాం. మా సంస్థ తరఫున ఆహారం, అంబులెన్స్, రేషన్కిట్స్, మాస్క్, శానిటైజర్లు పంపిణీ చేశాం. కొవిడ్ మృతులకు అంత్యక్రియలు సైతం నిర్వహించాం. కష్టాల్లో ఉన్నవారు వివరాలు తెలియజేస్తే మేం వారికి అండగా నిలుస్తాం. సమయంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ మా సేవలు కొనసాగుతాయి. 2011 నుంచి మా సంస్థ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది. మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. -ఏ.ఐ. జార్జ్ రాకేశ్ బాబు. ఫౌండర్, గుడ్ సమరిటన్స్ ఇండియా.