ముంబై: కరోనాను నియంత్రించడానికి లాక్డౌన్ విధించాలని భావిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వ యోచనను బజాజ్ ఆటోమొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. తామేమీ సర్కార్ ముందు నిలబడి గొర్రెల్లా తల ఊపబోమన్నారు.
సరిగ్గా ఏడాది క్రితం మెడికల్ మౌలిక వసతుల లేమి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైన సంగతిని రాజీవ్ బజాజ్ గుర్తు చేశారు. గతేడాది ప్రపంచంలోకెల్లా కఠిన ఆంక్షల మధ్య భారత్ లాక్డౌన్ అమలు చేసిందని చెప్పారు.
14 నెలల్లో మౌలిక వసతులను సమకూర్చుకోలేని దేశం కేవలం 14 రోజుల్లో ఎలా సాధిస్తుందని రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాల్సింది సర్కారేనన్నారు. ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగి తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలన్న సర్కార్ నిర్ణయాన్ని నిలదీశారు.
మహారాష్ట్రలో తాజాగా 60 వేలకు పైగా నూతన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్త కేసులు 1.6 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలోనే మరోమారు లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలొస్తున్నాయి.
అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించకుండా.. కంపెనీల్లో పని చేసే వారంతా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని నిబంధన విధించడం క్లాసిక్ కేస్ ఆఫ్ ఓవర్ రెగ్యులేషన్ అని రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు.
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తక్షణం, వాస్తవిక, స్పష్టమైన మద్దతునిస్తూ లాక్డౌన్ విధించాలని రాజీవ్ బజాజ్ సూచించారు. దేశ జీడీపీలో మహారాష్ట్ర నుంచే సుమారు 15 శాతం వస్తుంది.
ఎన్నికల సభలు, మతపరమైన మేళాల్లో నిబంధనల ఉల్లంఘన విషయమై రాజకీయ నేతలు మౌనంగా ఉండటాన్ని రాజీవ్ బజాజ్ నిలదీశారు. రాజకీయ నాయకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ముంగిట గొర్రెల్లా నిలబడి తల ఊపబోమని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత
ఓటమి భయంతో దీదీలో అలజడి : మోదీ