ముంబై, ఆగస్టు 31: జర్మనీకి చెందిన ఆటో రంగ దిగ్గజం ఫోక్స్వాగన్.. భారతీయ మార్కెట్లో కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పోలో, వెంటో ధరలు బుధవారం నుంచి 3 శాతం వరకు పెరుగుతాయని స్పష్టం చేసింది. పెరిగిన తయారీ ఖర్చులకు అనుగుణంగా కార్ల ధరలనూ పెంచకతప్పట్లేదని తెలిపింది.