న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: టెలికం దిగ్గజాల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ నుంచి వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారు. జూలై నెలలో వొడాఫోన్ ఐడియాకు 14.3 లక్షల మంది యూజర్లు గుడ్బై పలికినట్లు టెలిక రెగ్యులేటరీ ట్రాయ్ తాజాగా వెల్లడించింది. ఇదే నెలలో దేశంలో అతిపెద్ద సంస్థయైన జియో, ఎయిర్టెల్ నెట్వర్క్లను లక్షలాది మంది ఎంచుకున్నారు. జూలైలో జియో నెట్వర్క్లోకి 65.10 లక్షల మంది చేరగా, భారతీ ఎయిర్టెల్లోకి 19.42 లక్షల మంది ఎంచుకున్నట్లు వెల్లడించింది. దీంతో జియో 44.32 కోట్ల మంది వినియోగదారులతో తొలి స్థానంలో నిలిచింది. 35.40 కోట్ల మంది సబ్స్ర్కైబర్లతో ఎయిర్టెల్ ఆ తర్వాతి స్థానంలో ఉండగా..27.19 కోట్ల మందితో వొడాఫోన్ మూడో స్థానంలో నిలిచింది.