న్యూఢిల్లీ, జూలై 2: వైజాగ్ స్టీల్గా ప్రాచుర్యం పొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా దేబ్ కళ్యాణ్ మొహంతి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్గా కొనసాగుతున్న ఆయనకు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కంపెనీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులర్ సీఎండీ నియామకం జరిగేదాకా లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన కొత్త బాధ్యతల్ని నిర్వహిస్తారు. 2019 ఆగస్టులో ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (కమర్షియల్)గా ఆయన చేరారు. అంతకుముందు మొహంతి సెయిల్ ఈడీగా పనిచేశారు. ఆర్ఐఎన్ఎల్కు విశాఖలో 73 లక్షల టన్నుల సామర్థ్యం గల ఉక్కు ప్లాంటు ఉన్నది.