హయత్నగర్, ఏప్రిల్ 1: డివిజన్ పరిధిలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్రకేసరి నగర్, రోడ్డు నం.1లో రూ.75లక్షల వ్యయంతో, బాబూ జగ్జీవన్రాం కాలనీ నుంచి జీహెచ్ఎంసీ పరిధి వరకు రూ.58.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరదనీటి పైపులైన్ పనులకు వేర్వేరుగా స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సత్వర పరిష్కారం దిశగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, వార్డుమెంబర్ కాటెపాక స్కైలాబ్, బీజేపీ నేత కళ్లెం రవీందర్రెడ్డి, బండారి భాస్కర్, ఆంధ్రకేసరినగర్కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.పి.రవిశంకర్, వై.శ్రీనివాసులు, రంగరావు, కె.నర్సింహ, బాబూ జగ్జీవన్రాం కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర రవీందర్, హరిబాబు, రవిశంకర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ముదిరాజ్, నాయకులు చెన్నగోని శ్రీధర్గౌడ్, మదన్గౌడ్, భాస్కర్సాగర్, కృష్ణారెడ్డి, దేవ ప్రసన్న, బీజేపీ నాయకులు అశోక్, గోవిందచారి, సత్యనారాయణ, వెంకటేశ్, సంతోశ్, మొగులయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.