జూన్ 30 వరకు పెంచిన మారుతి
న్యూఢిల్లీ, మే 12: కరోనా సెకండ్ వేవ్ ఉదృతమవుతుండటంతో కార్ల కొనుగోలుదారులకు ఆటోమొబైల్ సంస్థలు శుభవార్తను అందించాయి. కార్లపై ఉచిత సేవలు, వారంటీల గడువలను వచ్చే నెల చివరి వరకు పెంచుతున్నట్లు కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో మార్చి 15 నుంచి మే 31 వరకు ఉన్న ఉచిత సేవలు, వారంటీల గడువులు మాత్రమే జూన్ 30 వరకు పొందవచ్చును. మరోవైపు టయోటా కూడా ఉచిత, వారంటీ సేవల గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.