హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పోలిస్తే రెండవ వేవ్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదు అయ్యింది. కేవలం పాజిటివిటీ రేటు మాత్రమే కాదు.. కోవిడ్ వల్ల మరణాలు కూడా అత్యధిక స్థాయిలో నమోదు అయియ్యాయి. అవర్వరల్డ్ ఇన్ డేటా వెబ్సైట్ గణాంకాల ప్రకారం.. ఓసారి కోవిడ్ డేటాను పరిశీలిద్దాం.
మే 23వ తేదీ నాటికి దేశంలో 3,03,751 మంది మరణించారు. ఆ సమయంలో కోవిడ్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నది మన దేవంలో. మన దేశ జనాభా 130 కోట్లు. అయితే మరణాల రేటును సగటుగా తీసుకుంటే.. ప్రస్తుతం భారత్లో ప్రతి పది లక్షల్లో 3.04 మరణాలు సంభవిస్తున్నట్లు డేటా చెబుతున్నది. మే 23వ తేదీ నాటికి వైరస్ వల్ల సంక్రమణకు గురైన వారి డేటాను పరిశీలిస్తే.. ప్రతి పది లక్షల మందిలో 189.99గా ఇన్ఫెక్షన్ రేటు ఉన్నది. అంటే సగటున సుమారు 2.5 లక్షల మందికి వైరస్ సోకినట్లు దీని అర్థం.
ఇక ఇండియా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్న తీరుపై కూడా డేటాను పరిశీలిద్దాం. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటి 10.87 శాతం మంది కనీసం మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. మే 23వ తేదీ నాటికి మొత్తం 3.02 శాతం మంది పూర్తి స్థాయిలో రెండు డోసుల టీకాలు వేయించుకున్నారు.