మహబూబ్నగర్: రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతు వేదికలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఒకప్పుడు వడ్డీలకు తెచ్చి వ్యవసాయం చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు రైతుబంధుతో ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గాలేకపోవడంతో పంటలు ఎండిపోయేవన్నారు. దీంతో పంట చేతికిరాక రైతులు అప్పులపాలయ్యే వారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు పోయాయని, 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తున్నదంటే అందుకు సీఎం కేసీఆర్ ఆలోచన విధానమే కారణమని మంత్రి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..