న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు గత వారం రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారట్ గోల్డ్ ధర వారం రోజుల నుంచి రూ.44 వేల వద్దే ఉంటున్నది. ఇవాళ రూ.44,100 ఉంది. ఇక 24 క్యారట్ బంగారం ధర మాత్రం రూ.48 వేల వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో వెండి మాత్రం కిలో రూ.73,500 పలుకుతున్నది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.89 తగ్గి రూ.46,167కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్చమైన బంగారం ధర 46,256 వద్ద ముగిసింది. అదేవిధంగా ఢిల్లీలో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.222 తగ్గి రూ.67,926కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 68,148 వద్ద ముగిసింది.