న్యూఢిల్లీ: ఐటీ శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు రావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. వచ్చేనెల 15 లోగా సమస్యలను పరిష్కరించాలని ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీ సలీల్ పరేఖ్ను ఆదేశించారు. సోమవారం ఈ విషయమై చర్చించేందుకు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్.. నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.
గత జూన్ ఏడో తేదీన ప్రారంభించిన ఈ వెబ్సైట్ కోసం రూ.4241 కోట్లు ఖర్చు చేశామని.. నాటి నుంచి సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. రెండున్నర నెలలుగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐటీ శాఖ అధికారులు చెప్పారు.
ఐటీ శాఖ వెబ్సైట్ సజావుగా సాగేందుకు తమ టీం ప్రయత్నిస్తున్నదని సలీల్ పరేఖ్ చెప్పారు. 750 మందికి పైగా సిబ్బంది ఐటీ శాఖ వెబ్సైట్పై పని చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారని సలీల్ పరేఖ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు.