హైదరాబాద్, జూలై 21: బ్రిటన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన డైసన్..భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్తోపాటు మరో 12 నగరాల్లో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్తోపాటు చండీఘడ్లలో తొలిసారిగా ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడంతోపాటు ఇక్కడి మార్కెట్పై మరింత పట్టు సాధించడానికి వీలు పడనున్నదని తెలిపింది.