సూర్యాపేట : సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని సహచర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డీఎంహెచ్ఓతోపాటు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గర్భిణులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
పూర్తి వసతులతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం వారంరోజుల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు.
అనంతరం విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తిచేశామని తెలిపారు.
ప్రజలకు కార్పొరేట్స్థాయి వైద్య సేవలు అందించేందుకు కొత్త జిల్లాల్లోనూ మెడికల్ కళాశాలలు స్థాపించామని గుర్తుచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి