హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో టూ వీలర్ వెహికిల్స్ కొనుగోలులో లీజింగ్కు భారీ ఆదరణ లభిస్తున్నదని ఫైనాన్స్ స్టార్టప్ ఓటీఓ టెక్నాలజీస్ తెలిపింది. వాహనాల లీజింగ్ కోసం తమ సంస్థలో రుణం తీసుకుంటున్న వారి సంఖ్య 386 శాతం వృద్ధి చెందిందన్నది. కొత్తగా మరో 45 వాహన డీలర్లు తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది. ఈ ఏడాది కనీసం 3000 మంది వినియోగదారులకు సేవలందించాలని నిర్దేశించుకున్నట్లు ఓటీటీ టెక్నాలజీస్ తెలిపింది.
భాగ్య నగరంలో 4 నెలల క్రితం ఓటీటీ టెక్నాలజీస్ సేవలు మొదలయ్యాయి.. ఇప్పటి వరకు 400కి పైగా టూ వీలర్స్ లీజింగ్కు ఫైనాన్స్ అందించినట్లు తెలిపింది. తమ సంస్థ ఆన్లైన్ వ్యాపారంలో 35 శాతం ఒక్క హైదరాబాద్లోనే జరిగిందని పేర్కొంది. లాక్డౌన్ తర్వాత స్వయం ఉపాధి పొందుతున్న వారు 46 శాతం లీజింగ్ సేవల వైపు మొగ్గుతున్నారని తెలిపింది.
స్కూటర్లు, ధర రూ.లక్ష కంటే తక్కువ ఉన్న కొత్త మోడల్ బైక్లకు ఆదరణ బాగా ఉందని ఓటీఓ తెలిపింది. బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఓటీటీ టెక్నాలజీస్ సేవలందిస్తున్నది. ఈ సంస్థ ఇప్పటి వరకు 160 మంది డీలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.