న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.108.37 చేరగా.. డీజిల్ రూ.101.12కి పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.97.22కు చేరింది. మే 4 నుంచి ఇప్పటి వరకు పెరిగిన ఇంధన ధరలను లెక్కిస్తే లీటరు పెట్రోల్పై 6.82, డీజిల్పై రూ.7.24 పెరిగింది.