న్యూఢిల్లీ: గత వారాంతంలో టెస్లా సీఈవో ఎలన్మస్క్ చేసిన ట్వీట్తో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. తత్ఫలితంగా మంగళవారం ట్రేడింగ్లో బిట్ కాయిన్, పొల్కాడాట్ తదితర టాప్-10 డిజిటల్ కరెన్సీలు 16 శాతం పుంజుకున్నాయి. సమీప భవిష్యత్లో తమ కార్ల విక్రయానికి బిట్ కాయిన్ చెల్లింపులను అనుమతినిస్తామని ఎలన్మస్క్ ట్వీట్ చేశారు.
సోమవారం ట్రేడింగ్లో కొంత మెరుగైన క్రిప్టో కరెన్సీలు మంగళవారం ట్రేడింగ్లో మరింత పుంజుకున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే మంగళవారం బిట్ కాయిన్ 4.32 శాతం లబ్ధి పొంది 40,518.56 డాలర్ల వద్ద స్థిర పడింది.
రెండో స్థానంలో ఉన్న క్రిప్టో ఏథేరియం 4.82 శాతం పుంజుకుని 2,595.23 డాలర్లకు చేరుకున్నది. టెథర్ ఒక డాలర్, బినాన్స్ 4.22 శాతం పురోభివ్రుద్ధితో 373.65 డాలర్లకు చేరింది. డోజ్కాయిన్ 1.74 శాతంతో 0.33 డాలర్లు, పొల్కాడాట్ 16.785 శాతం లబ్ధితో 25.26 డాలర్ల వద్ద ముగిసింది.
ఇంతకుముందు ఫిబ్రవరిలో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్తో బిట్ కాయిన్ విలువ ఆల్టైం రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కానీ, ఇటీవల బిట్ కాయిన్ మైనింగ్తో పర్యావరణ సమస్య ఇమిడి ఉన్నందున దాన్ని తమ కార్ల విక్రయ లావాదేవీలను అనుమతించబోమని ప్రకటించారు.
అయితే, ఎలన్ మస్క్ యూ-టర్న్ ట్వీట్తోపాటు చైనా ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై నిషేధం విధించాయి. అంతేకాదు. బిట్ కాయిన్తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీల మైనింగ్ను చైనా నిషేధించడం కూడా వాటి విలువ పతనానికి మరో కారణం.