నల్లగొండ : నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు. ఇటీవల దాడులు నిర్వహించి సీజ్ చేసిన నిషేధిత పొగాకు ఉతత్తులను శనివారం ఫుడ్ సేఫ్టీ డేసిగినేటెడ్ అధికారిణి జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిల సమక్షంలో దహనం చేశారు.
ఈ సందర్భంగా డీఐజీ, జ్యోతిర్మయి మాట్లాడుతూ.. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించి సీజ్ చేసిన పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దహనం చేశామన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిషేధిత ఉత్పత్తులపై నిరంతర నిఘా ఉంటుందనారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రజలు ఎక్కడైనా ఇలాంటి ఉత్పత్తులను విక్రయిస్తే సమాచారం అవ్వాలని కోరారు. కార్యక్రమంలో నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ సీఐలు నిగిడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఐసోలేషన్ సెంటర్ను సందర్శించిన ఎంపీ కవిత