ములుగు : వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు బావి వద్దకు వెళ్తున్న రైతు పిడుగు పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం ఖాసీందేవిపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రంజాన్ (65) అనే రైతు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం అకాల వర్షం పడటంతో పంట చేనులో ఉన్న మిర్చి,వరి తడుస్తున్నదని పొలం వద్దకు వెళ్తుండగా రంజాన్ పై పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ