ముంబై,జూన్ 11:ఈరోజు సెన్సెక్స్ 52,600 పాయింట్లకు పైగా చేరుకున్నది. నిఫ్టీ 15,900 దిశగా కొనసాగుతున్నది. సెన్సెక్స్ 52,477.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,633.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,472.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 0.39శాతం అంటే 205.95 పాయింట్లు ఎగిసి 52,506.42 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,796.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,835.55 గరిష్టాన్ని, 15,781.45 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 0.34శాతం ఎగిసి 15,791.20 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 3.74 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.93 శాతం, టీసీఎస్ 1.53 శాతం, HCL టెక్ 1.51 శాతం, ఇన్ఫోసిస్ 1.43 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 1.58 శాతం, ఎస్బీఐ 0.98 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 0.85 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.76 శాతం, HDFC లైఫ్ 0.79 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉన్నాయి.